Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో ‘కవచ్’ అమలుకు శ్రీకారం

Follow Udayam Digital on Google
విజయవాడలో ‘కవచ్’ అమలుకు శ్రీకారం - Udayam Digital
దక్షిణ కొస్తా రైల్వే జోన్‌లో స్వదేశీ రైలు రక్షణ వ్యవస్థ ‘కవచ్’ అమలుకు శ్రీకారం చుడుతున్నట్లు రైల్వే జీఎం సందీప్ మథుర్ తెలిపారు. డిసెంబరు నాటికి విజయవాడ డివిజన్‌లోని 100 కి.మీ. హైడెన్సిటీ మార్గంలో అమలు చేయనున్నారు. రైలు వేగ పరిమితి దాటినా లేదా ఢీకొనే ప్రమాదం ఉన్నా ‘కవచ్’ స్వయంచాలకంగా బ్రేకులు వేసి ప్రమాదాలను నివారిస్తుంది. అనంతరం ఈ వ్యవస్థను విశాఖ డివిజన్‌కు విస్తరించనున్నారు.

Comments

G
Loading comments...