వార్తలకు తిరిగి వెళ్లండి
కాకతీయుల నాటి బావి నేటికీ జీవనాధారం

కాకతీయుల కాలంలో వర్ధమాన మహారాజు నిర్మించిన కామాక్షమ్మ బావి నేటికీ వర్ధమానుకోటలోని కొన్ని కాలనీలకు తాగునీటిని అందిస్తోంది. ఒకప్పుడు గ్రామమంతటికీ ఈ బావే ప్రధాన నీటి వనరుగా ఉండేదని స్థానికులు తెలిపారు.
బావి చుట్టూ 16 మోటలు ఉండేవని, ఒకేసారి 16 మంది నీరు తీసుకునేవారని చెబుతున్నారు. పుట్టకోట, కామాక్షి ఆలయంతో ఈ ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యం ఉందని గ్రామస్థులు పేర్కొన్నారు.
Comments
Loading comments...