Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాతకు వచ్చిన పత్తిని తినేసిన కోతులు

Follow Udayam on Google
Muthyam silari Sep 13, 2026 5:28 PM నిర్మల్General
పంట చేతికొచ్చే సమయంలో కోతుల బెడద పత్తి రైతుకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. గ్రామానికి చెందిన రైతు పీసరి మహేశ్వర్ సాగు చేసిన ఎకరం పత్తి పంటపై పదుల సంఖ్యలో కోతులు దాడి చేశాయి. కాతకు వచ్చిన పత్తి కాయలను తినడంతో సుమారు రెండు క్వింటాళ్ల దిగుబడి నష్టపోయినట్లు రైతు తెలిపాడు. ఇప్పటికే వాతావరణ పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న తనకు కోతుల దాడి మరింత నష్టాన్ని తెచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

Comments

G
Loading comments...