Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలనీవాసులను సురక్షిత ప్రాంతానికి తరలింపు

Follow Udayam on Google
p.g.murthy Jul 30, 2026 7:56 PM మంచిర్యాలGeneral
కాలనీవాసులను సురక్షిత ప్రాంతానికి తరలింపు - Udayam
జన్నారం పట్టణంలోని బుడగ జంగాల కాలనీ వాసులను అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. పట్టణ శివారులోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న జన్నారం వాగు ఉధృతంగా ప్రవహిస్తూ వరద నీరు కాలనీలోకి ప్రవేశించింది. దీంతో అప్రమత్తమైన గ్రామ సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ ఆధ్వర్యంలో ఎంపీడీవో ఉమర్ షరీఫ్, తాసిల్దార్ బక్కన్న, ఈవో రాహుల్ సిబ్బందితో కలిసి కాలనీలో పర్యటించి కాలనీవాసులను సమీప ప్రభుత్వ పాఠశాలకు తరలించారు.

Comments

G
Loading comments...