వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో స్టైపెండ్ పెంపుపై స్పష్టమైన హామీ రాకపోవడంతో జూనియర్ డాక్టర్లు సోమవారం నుంచి అత్యవసర సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు సాధారణ వైద్య సేవలకు మాత్రమే దూరంగా ఉన్నామని వారు తెలిపారు.
ప్రభుత్వం స్పందించకపోవడంతో ఐసీయూ సహా ఎమర్జెన్సీ సేవలను కూడా నిలిపివేయాల్సి వస్తోందని డాక్టర్లు పేర్కొన్నారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు వైద్యారోగ్య శాఖ ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోంది.
Comments
Loading comments...

