Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూడో జట్టుకు ఢిల్లీలో ఘన స్వాగతం

Follow Udayam Digital on Google
విఘ్నేష్ రెడ్డి Aug 04, 2026 10:15 AM ఆల్ ఇండియా జాతీయ
కామన్‌వెల్త్ గేమ్స్‌లో పతకాలతో అదరగొట్టిన భారత జూడో బృందానికి ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. 60 కేజీల విభాగంలో చారిత్రాత్మక స్వర్ణం సాధించిన హర్ష్ సింగ్ మాట్లాడుతూ.. ఇన్ని రోజులు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని, తనకు ఈ స్థాయిలో స్వాగతం పలుకుతారని ఎప్పుడూ ఊహించలేదని ఆనందం వ్యక్తం చేశారు. అభిమానుల ఉత్సాహం తనకు మరింత శక్తినిచ్చిందన్నారు.

Comments

G
Loading comments...