వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో భూ కబ్జాలపై విశాలాంధ్రలో కథనాలు రాసిన విలేకరి గోవిందరావుపై దుండగులు కర్రలతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటనను జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు.
ఈ ఘటనకు నిరసనగా APUWJ పలాస శాఖ ఆధ్వర్యంలో కాశీబుగ్గ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులు శనివారం ఆందోళన చేపట్టారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

