వార్తలకు తిరిగి వెళ్లండి
జర్నలిస్ట్ కాలనీ రోడ్డులో ట్రాఫిక్ పరిశీలన.

మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలోని నిజాంపేట్ ప్రధాన రోడ్డు నుంచి జర్నలిస్ట్ కాలనీకి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం అధికారులు పరిశీలన చేపట్టారు.
నిత్యం అధిక వాహన రద్దీ ఉండటంతో ట్రాఫిక్ మళ్లింపు, వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించారు. మియాపూర్ ట్రాఫిక్ సీఐ బి. నరసింహరెడ్డి, ఆర్ఐ రమేష్ నాయక్, ట్రాఫిక్ ఎస్ఐ సత్యానందం రహదారిని పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.
Comments
Loading comments...