వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్ కార్యకలాపాలకు ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా విఘాతం కలిగిస్తున్నాయని రాజ్యసభలో సభా నాయకుడు జేపీ నడ్డా ఆరోపించారు. చర్చల్లో పాల్గొనకుండా సభను అడ్డుకోవడంపైనే ప్రతిపక్షాలు దృష్టి సారించాయని విమర్శించారు.
ఏ అంశంపైనైనా చర్చించేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సరైన అంశాలు లేకపోవడంతోనే ప్రతిపక్షాలు తమ డిమాండ్లను మారుస్తున్నాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...
