Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగాల పేరుతో రూ.3.20 లక్షల మోసం

Follow Udayam on Google
ఉద్యోగాల పేరుతో రూ.3.20 లక్షల మోసం - Udayam
తిరుపతి జిల్లా పాకాలవారిపల్లెలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ప్రసాద్‌ అనే వ్యక్తి రూ.3.20 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఓ మహిళ ఆరోపించారు. మూడేళ్ల క్రితం డబ్బులు తీసుకున్నా ఉద్యోగం ఇప్పించలేదని ఆమె తెలిపారు. పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానని నిందితుడు బెదిరిస్తున్నాడని, మరికొందరు బాధితులు ఉన్నారని ఆమె ఆరోపించారు.

Comments

G
Loading comments...