వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండల ఫోటో, వీడియో గ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్వర్యంలో బుధవారం 187వ ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ మొదట అసోసియేషన్ మండల గౌరవ అధ్యక్షులు కస్తూరి ప్రభాకర్ ఫోటోగ్రఫి జెండా ఆవిష్కరించడం జరిగింది.
అలాగే స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ లోని రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పోతూ వేణుగోపాల్, మండల అధ్యక్షులు దుమల్ల ప్రశాంత్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

