Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా సమగ్రాభివృద్ధిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి

Follow Udayam on Google
RR REDDY Aug 19, 2026 11:23 PM నిజామాబాద్General
జిల్లా సమగ్రాభివృద్ధిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి - Udayam
నిజామాబాద్: జిల్లా సమగ్రాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బండారు రవికుమార్ కోరారు. బుధవారం సీపీఎం కార్యాలయంలో జరిగిన రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. బోధన్–బీదర్, ఆర్మూర్–ఆదిలాబాద్ రైల్వే లైన్లను పూర్తి చేయాలని, మూతపడిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...