వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల కలెక్టరేట్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పాపన్న సామాజిక, ఆర్థిక అసమానతలను ప్రశ్నించి అణగారిన వర్గాల ఆత్మగౌరవం, సమానత్వం, సామాజిక న్యాయం కోసం పోరాడిన ప్రజా నాయకుడని కలెక్టర్ పేర్కొన్నారు.
ఆయన పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. ఉద్యోగులు, కుల సంఘాలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

