వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పట్టణంలో సైబర్ మోసం కలకలం రేపింది. ఓ వ్యక్తి తన స్నేహితుడి నంబర్ నుంచి వచ్చినట్లు కనిపించిన APK ఈ-చలాన్ లింక్ను ఓపెన్ చేయడంతో ఏకంగా రూ.4 లక్షల 15 వేల నగదును కోల్పోయాడు.
దీంతో బాధితుడు అశోక్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని ఏపీకి ఫైల్స్ లింకులు, ఈ-చలాన్ మెసేజ్లను ఓపెన్ చేయవద్దని తెలిపారు.
Comments
Loading comments...

