Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలో కదం తొక్కిన కార్మికులు.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 11, 2026 8:28 AM జగిత్యాలGeneral
జగిత్యాలలో కదం తొక్కిన కార్మికులు. - Udayam
కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ,రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం చేపట్టిన జైల్‌భరో కార్యక్రమంలో పలువురు కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Comments

G
Loading comments...