వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల 9వ వార్డు శాంతి నగర్లోని సుదర్శన గోశాల యందు శుక్రవారం శ్రీలక్ష్మీనారాయణ ఇష్టి యాగం, కుంకుమ పూజలు జగన్నాథం చక్రపాణి భరద్వాజస ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. దాదాపు 50మంది మాతలు కుంకుమ పూజలో పాల్గొన్నారు.
అనంతరం శాంతినగర్ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదం, అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు. కుంకుమ అర్చన పూజా సామాగ్రి భక్తులకు నోముల నాగేందర్ రెడ్డి - స్వప్న అందజేశారు.
Comments
Loading comments...

