వార్తలకు తిరిగి వెళ్లండి

రాఖీ పండుగ ముగింపు, ఆదివారం సెలవుతో జడ్చర్ల ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. హైదరాబాద్, మహబూబ్నగర్ వెళ్లేందుకు బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి వేచి చూశారు.
అరకొర బస్సులతో ఎక్కేందుకు తోపులాట జరగడంతో మహిళలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రద్దీ దృష్ట్యా అదనపు ప్రత్యేక బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

