వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్కర్నూల్ జిల్లా విశ్రాంత ఉద్యోగస్తుల కార్యాలయం రాధాకృష్ణ భవన్లో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని నిర్వహించారు. విశ్రాంత ఉద్యోగులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెలంగాణ సాధనకు జయశంకర్ చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఆయన అందించిన మార్గదర్శకత్వాన్ని ప్రజలు ఎప్పటికీ మరువరని వక్తలు పేర్కొన్నారు.
Comments
Loading comments...

