వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటించనున్నారు. పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కొనుగోళ్ల తీరును పరిశీలించనున్నారు.
అనంతరం పొగాకు రైతులతో ముఖాముఖి నిర్వహించి గిట్టుబాటు ధర, కొనుగోళ్లు, సాగు సమస్యలపై చర్చించనున్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నేరుగా తెలుసుకుని వారి అభిప్రాయాలు విననున్నారు.
Comments
Loading comments...
