వార్తలకు తిరిగి వెళ్లండి
ఎద్దుల పరుగు పోటీలు అట్టహాసం

అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో మంటెద్దుల అమావాస్య వేడుకలను రైతులు ఘనంగా నిర్వహించారు. హవళిగి, కరకముక్కల గ్రామాల్లో ఎద్దులకు కొమ్ము రంగులు పూసి, ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
సాయంత్రం నిర్వహించిన ఎద్దుల పరుగు పోటీలు వీక్షకులను అలరించాయి. గెలుపొందిన ఎద్దులతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించగా, చుట్టుపక్కల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...