Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ ఐక్యత నినాదాలతో మార్మోగిన కుబీర్

Follow Udayam on Google
Naresh Aug 14, 2026 10:50 AM నిర్మల్General
జాతీయ ఐక్యత నినాదాలతో మార్మోగిన కుబీర్ - Udayam
నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఒకరోజు ముందుగానే మిన్నంటాయి. మండల కేంద్రంలోని పాఠశాల విద్యార్థులు పొడవైన జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ చేపట్టారు. భారత జాతీయ ఐక్యతను చాటేలా విద్యార్థులు చేసిన దేశభక్తి నినాదాలతో ప్రధాన వీధులు మార్మోగాయి. మువ్వన్నెల జెండాలను చేతబూని విద్యార్థులు ప్రదర్శించిన శోభాయాత్ర స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది.

Comments

G
Loading comments...