వార్తలకు తిరిగి వెళ్లండి

మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా ఇరాన్ డ్రోన్లతో దాడికి పాల్పడింది. ఈ దాడి కారణంగా విమానాశ్రయ ఆస్తులకు భారీ నష్టం వాటిల్లడమే కాకుండా, పలువురు తీవ్రంగా గాయపడ్డారని కువైట్ సైన్యం అధికారికంగా వెల్లడించింది.
గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్ చేస్తూ ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. తాజా దాడి నేపథ్యంలో కువైట్ ఎయిర్పోర్టులో అత్యవసర పరిస్థితిని విధించి, విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.
Comments
Loading comments...

