వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం రంగనాయకులగుట్టలో యువకుడు హత్యకు గురైన విషయం తెలిసిందే. గురువారం రాత్రి వేముల మధు తన ఇంటి బయట మూత్ర విసర్జన చేస్తుండగా శ్రీనాథ్ ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటమాట పెరగడంతో శ్రీనాథ్ కర్రతో మధు తలపై కొట్టాడు.
దీంతో ఆగ్రహానికి గురైన మధు తన ఇంట్లో కత్తి తీసుకువచ్చి శ్రీనాథ్ ను పొడిచాడు. కత్తిపోట్లకు గురైన శ్రీనాథ్ ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
Comments
Loading comments...

