వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడీ కేంద్రాల్లో వంద శాతం టాయిలెట్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. చిన్నారులకు పాలు, అల్పాహార పథకాన్ని అన్ని జిల్లాల్లో వేగంగా అమలు చేయాలని సూచించారు.
గత ఏడాదిలో వేలాది కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించిన సిబ్బందిని మంత్రి అభినందించారు. టీచర్లు, ఆయాల ఖాళీలను త్వరగా భర్తీ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
Comments
Loading comments...
