వార్తలకు తిరిగి వెళ్లండి

ఏల్చూరులో పంట పొలాల మధ్య నిర్మించిన విఘ్నేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని సోమవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామస్థుల సహకారంతో నిర్మించిన ఆలయంలో వేద పండితులు వినుకొండ శరత్చంద్ర ఆధ్వర్యంలో సంప్రదాయ పూజలు నిర్వహించారు.
వేద మంత్రోచ్ఛారణల మధ్య విఘ్నేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
Comments
Loading comments...

