వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల తెలుగుపేటలోని శ్రీ మద్దులేటి లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో నవ నరసింహ విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. రెండో రోజు విశ్వక్సేన ఆరాధన, జలాధివాసం, పూర్ణాహుతి పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
శ్రీ అంధలం నరసింహాచార్యులు, ప్రధాన అర్చకులు శ్రీరామ్మూర్తి ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల నడుమ క్రతువులు ఘనంగా జరిగాయి.
Comments
Loading comments...

