వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ గ్రామ సర్పంచ్ సాయి చరణ్ ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించారు. వర్షపు నీటిని వృథాగా పోనివ్వకుండా ఇంకుడు గుంతల్లోకి మళ్లించడం ద్వారా భూగర్భ జలాలను పెంచుకోవచ్చని తెలిపారు.
ప్రతి ఇంటి పరిసరాల్లో, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ ప్రదేశాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నీటి సంరక్షణకు ప్రజలంతా బాధ్యతగా ముందుకు రావాలని సాయి చరణ్ పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

