Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత మహిళల టీటీ టీమ్‌కు పసిడి

Follow Udayam Digital on Google
మానస శర్మ Jul 31, 2026 5:58 PM ఆల్ ఇండియాక్రీడలు
కామన్‌వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌ 2026లో భారత మహిళల జట్టు స్వర్ణ పతకం సాధించింది. న్యూఢిల్లీలో జరిగిన ఫైనల్లో మలేషియాపై 3-0 తేడాతో ఘన విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. భారత్ తరఫున స్వస్తిక ఘోష్, శ్రీజ ఆకుల, యశస్విని ఘోర్పడే అద్భుత ప్రదర్శనతో విజయాన్ని అందించారు. ఈ టోర్నీలో భారత మహిళల జట్టు ఓటమి ఎరుగకుండా పసిడి గెలవడం విశేషం.

Comments

G
Loading comments...