వార్తలకు తిరిగి వెళ్లండి

అరుణాచల్ప్రదేశ్లోకి చైనా దళాలు అక్రమంగా చొరబడ్డాయన్న నివేదికలపై భారత్ తీవ్రంగా స్పందించింది. సరిహద్దు పరిస్థితులే ఇరు దేశాల సంబంధాల భవిష్యత్తును నిర్ణయిస్తాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
ఆగస్టు 6న జరిగిన WMCC 36వ సమావేశంలోనూ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. సరిహద్దుల్లో శాంతిభద్రతలు కీలకమని, అరుణాచల్ప్రదేశ్ భారత్లో అంతర్భాగమని జైస్వాల్ స్పష్టం చేశారు.
Comments
Loading comments...

