వార్తలకు తిరిగి వెళ్లండి

కొడిమ్యాల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉపాధ్యాయుల ప్రణాళిక, కృషితో ఇప్పటివరకు 329 మంది కొత్తగా చేరగా జిల్లాలోనే అత్యధిక ప్రవేశాలు నమోదయ్యాయి.
వేసవి సెలవుల్లో ఇంటింటి ప్రచారం, నాణ్యమైన విద్యపై అవగాహన కల్పించడం, ఉచిత వసతులు వివరించడం ఫలితాన్నిచ్చాయి. విద్యార్థుల సంఖ్య పెరిగిన పాఠశాలలకు ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

