Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెత్తతోనే పంచాయతీలకు ఆదాయ మార్గం

సాయి తేజ Jul 27, 2026 4:23 PM సిద్దిపేటతెలంగాణ
చెత్తతోనే పంచాయతీలకు ఆదాయ మార్గం - Udayam Digital
సిద్దిపేట జిల్లాలోని పెద్దలింగారెడ్డిపల్లి, కట్కూర్ గ్రామ పంచాయతీలు చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చి ఆదాయం పొందుతున్నాయి. వ్యర్థాల నిర్వహణతో పాటు స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇస్తూ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. పెద్దలింగారెడ్డిపల్లిలో 2,500 కిలోలు, కట్కూర్‌లో 2,000 కిలోల సేంద్రియ ఎరువును తయారు చేసి విక్రయించారు. దీంతో వరుసగా రూ.17,500, రూ.12,000 ఆదాయం వచ్చినట్లు పంచాయతీ ప్రతినిధులు తెలిపారు.

Comments

G
Loading comments...