Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధితులకు సత్వర న్యాయం అందించాలి: సీపీ అంబర్ కిశోర్ ఝా

పార్వతి దేవి Jul 24, 2026 6:52 PM వికారాబాద్about 1 hour ago
బాధితులకు సత్వర న్యాయం అందించాలి: సీపీ అంబర్ కిశోర్ ఝా - Udayam Digital
బాధితుల ఫిర్యాదులపై వేగంగా స్పందించి, పారదర్శక విచారణ జరిపి సత్వర న్యాయం అందించాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా పోలీసు అధికారులను ఆదేశించారు. తాండూర్ సర్కిల్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫిర్యాదుదారులతో ఓర్పుగా వ్యవహరించి వారి సమస్యలను శ్రద్ధగా వినాలని సూచించారు. రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...