వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కనూరు మండలం ఈస్సన్నపల్లి మీదుగా జేబీఎస్కు ఆర్టీసీ అధికారులు బస్సు సౌకర్యం కల్పించినట్లు గ్రామ సర్పంచ్ రాములు తెలిపారు. శుక్రవారం గ్రామానికి తొలిసారిగా వచ్చిన బస్సుకు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ బస్సు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించి సౌకర్యం కల్పించారని తెలిపారు.
Comments
Loading comments...

