Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 3 నుంచి ఓటర్ల జాబితా ధ్రువీకరణ గ్రామసభలు

Follow Udayam on Google
T. SRINU BABU Sep 02, 2026 9:28 PM పల్నాడుGeneral
ఈనెల 3 నుంచి ఓటర్ల జాబితా ధ్రువీకరణ గ్రామసభలు - Udayam
రానున్న మండల పరిషత్ ఎన్నికల నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితా ధ్రువీకరణ కోసం ఈనెల 3 నుంచి 6 వరకు గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు దాచేపల్లి ఎంపీడీవో డి. వీరయ్య బుధవారం వెల్లడించారు. ఈ సభల నిర్వహణకు మండల స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. పారదర్శకమైన, సరైన ఓటర్ల జాబితా తయారీకి ఓటర్లు తమ వివరాలను ధ్రువీకరించుకుంటూ అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...