వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ డిమాండ్ల సాధనకు ఈనెల 27న కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ‘రీట్’ రాష్ట్ర అధ్యక్షుడు కోహెడ చంద్రమౌళి కోరారు.
శనివారం స్థానిక పెన్షనర్ భవన్లో మాట్లాడారు. నిలిచిన 6 డీఏలు, గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్లు తక్షణమే చెల్లించాలన్నారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఈ పోరాటంలో విశ్రాంత ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొనాలని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

