వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణBreaking
రూ.600 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

బంజారాహిల్స్లోని బంజారా చెరువు పక్కన ఉన్న రూ.600 కోట్ల విలువైన 3.63 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు కాపాడారు. స్థానికుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపి ఆక్రమణలు జరగకుండా కంచె ఏర్పాటు చేశారు.
దీనితో పాటు హయత్నగర్, బోడుప్పల్ పరిధిలోని పార్కు స్థలాలను కూడా హైడ్రా స్వాధీనం చేసుకుంది. కోర్టు వివాదం తేలే వరకు భూమిని కాపాడతామని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.
Comments
Loading comments...