Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లికి వందనం డబ్బులు కాజేశారని భార్యపై భర్త ఫిర్యాదు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 11, 2026 10:11 AM గుంటూరుGeneral
తల్లికి వందనం డబ్బులు కాజేశారని భార్యపై భర్త ఫిర్యాదు - Udayam
పిల్లల కోసం ప్రభుత్వం జమ చేసిన తల్లికి వందనం డబ్బులను తన భార్య కాజేసిందని భర్త ఫిర్యాదు చేశాడు. పిల్లలతో కలిసి సోమవారం ఎస్పీ పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశాడు. లింగాయపాలెంకు చెందిన నాగభూషణం పాతగుంటూరుకు చెందిన మహిళను 2018లో రెండో వివాహం చేసుకున్నాడు. నాలుగేళ్లుగా మనస్పర్థలతో ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. ఖాతాలో జమ అయిన పిల్లల డబ్బులను భార్య కాజేసిందని, న్యాయం చేయాలని ఫిర్యాదులో కోరాడు.

Comments

G
Loading comments...