వార్తలకు తిరిగి వెళ్లండి

కులాంతర వివాహం చేసుకున్న మహిళలకు భర్త కులం ఆధారంగా కుల ధ్రువీకరణ పత్రం జారీ చేయడం సాధ్యం కాదని రాయికల్ తహశీల్దార్ నాగార్జున తెలిపారు. అలా చేస్తే అనర్హులకు లబ్ధి చేకూరే అవకాశం ఉందన్నారు.
మహిళలు పుట్టింటి కుల ధ్రువీకరణ పత్రంతోపాటు అవసరమైన ఆధారాలు సమర్పించాలని సూచించారు. వాటిని పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

