వార్తలకు తిరిగి వెళ్లండి

యానంలో భార్యను హత్య చేసి కనిపించడం లేదంటూ భర్త పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన వెలుగుచూసింది. గ్రామానికి చెందిన చెక్కా అప్పారావు తన భార్య రేఖ కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు.
అతని సమాధానాల్లో పొంతన లేకపోవడంతో అనుమానించిన పోలీసులు విచారించారు. దీంతో రేఖను తానే హత్య చేసి నిర్మానుష్య ప్రాంతంలో పడేసినట్లు అప్పారావు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

