Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంగోలులో మైనింగ్ అధికారిపై వేటు

Follow Udayam on Google
హరిక Aug 18, 2026 12:57 PM ప్రకాశం ఆంధ్రప్రదేశ్
ఒంగోలులో మైనింగ్ అధికారిపై వేటు - Udayam
ఒంగోలులో మైనింగ్ అధికారి శివశంకర్ రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. చీమకుర్తిలోని రెండు గ్రానైట్‌ క్వారీల్లో జరిగిన ప్రమాదాల పరిశీలనకు వచ్చిన ఆయన క్వారీ మేనేజర్ల నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. ఈ ఘటనలో శివశంకర్‌తో పాటు లంచం ఇచ్చేందుకు వచ్చిన క్వారీ మేనేజర్లతో సహా ఐదుగురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...