వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయకుడి ఆగమనం సందర్భంగా డీజేలు ఏర్పాటు చేయడం, అధిక శబ్దంతో సంగీతం వినిపించడం, బాణసంచా కాల్చడం అనుమతించేది లేదని హుజురాబాద్ టౌన్ సీఐ కర్ణాకర్ తెలిపారు. శాంతియుతంగా వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు.
అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జాగ్రత్తలు పాటించాలని, పోలీసులకు సహకరించాలని కోరారు. అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

