వార్తలకు తిరిగి వెళ్లండి

ఆచంటలో సెప్టెంబర్ నెలలోనూ ఎండలు మండిపోతున్నాయి. మే నెలను తలపించేలా భానుడి భగభగలతో పాటు ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మధ్యాహ్నం 12 గంటలు దాటితే ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి.
సరైన వర్షపాతం లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణం ఎప్పుడు చల్లబడుతుందోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
Comments
Loading comments...

