వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణBreaking
రంగారెడ్డి జిల్లాలో ఘోరం: ఆరుగురి దారుణ హత్య

రంగారెడ్డి జిల్లా షాబాద్ దైవాలగూడలో రాజ్కుమార్ అనే వ్యక్తి శనివారం తెల్లవారుజామున ఆరుగురిని కిరాతకంగా హత్య చేశాడు. తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో బెయిల్పై వచ్చిన నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు.
హత్యకు గురైన వారిలో బాధిత బాలిక, ఆమె తల్లి, నానమ్మతో పాటు నిందితుడి భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Comments
Loading comments...