వార్తలకు తిరిగి వెళ్లండి

తానూర్ మండలంలోని హంగిర్గ గ్రామ అభివృద్ధికి రూ.కోటిన్నర నిధులు మంజూరైనట్లు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ తెలిపారు. ఆదివారం దేవాదాయ శాఖ సీజీఎఫ్ నిధులు రూ.50 లక్షలతో చేపట్టనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
అంగన్వాడీ, వీఓ, గ్రామపంచాయతీ భవనాల నిర్మాణాలకు ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
Comments
Loading comments...

