Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హకీంపేట భూ బాధితుల ఆందోళన

Follow Udayam on Google
dasari naveen kumar Aug 11, 2026 5:10 PM వికారాబాద్General
హకీంపేట భూ బాధితుల ఆందోళన - Udayam
కొడంగల్‌లో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ భూ బాధితులకు అండగా బీఆర్ఎస్ చేపట్టిన ధర్నాకు రైతులు భారీగా తరలివచ్చారు. ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ ప్లాట్ల కేటాయింపు, రహదారుల నిర్మాణంలో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేటాయించిన ప్లాట్లలోనే డ్రైనేజీలు నిర్మిస్తూ, గుడులు, బడులు, పార్కులకు స్థలాలు ఇవ్వలేదని ఆరోపించారు. భూసేకరణ, పరిహారంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...