వార్తలకు తిరిగి వెళ్లండి

క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న భారీ వర్షాలు, ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో హిమాయత్సాగర్ జలాశయం గేట్లను ఈరోజు సాయంత్రం 6 గంటలకు అధికారులు ఎత్తారు. నీటి మట్టాన్ని నియంత్రించేందుకు మొదటగా 1,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఇన్ఫ్లో ఆధారంగా ఔట్ఫ్లోను సవరిస్తామని తెలిపారు. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల యంత్రాంగం, హైడ్రా, జీహెచ్ఎంసీ, పోలీస్ అధికారులు హై అలర్ట్లో ఉన్నారు.
Comments
Loading comments...

