వార్తలకు తిరిగి వెళ్లండి
హైవేపై పోలీసులపై దొంగల దాడి.. ఎదురుకాల్పులు

నంద్యాల జిల్లా డోన్ హైవేపై తెల్లవారుజామున పందుల లోడ్ వాహనంలో వెళ్తున్న దొంగలు రాళ్లు, సీసాలతో పోలీసులపై దాడికి తెగబడ్డారు. వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించిన పోలీసులపై దుండగులు దాడి చేయడంతో పోలీసులు కాల్పులు జరిపారు.
ఈ ఘర్షణలో హైవే పెట్రోలింగ్ వాహనం అద్దాలు ధ్వంసమవగా, దుండగులు తప్పించుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.
Comments
Loading comments...