వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పురపాలికతో పాటు పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయమై వాహనదారులు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడ్డారు. అలాగే పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
మరోవైపు గత కొన్ని రోజులుగా తీవ్ర ఎండ వేడిమి, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న స్థానిక ప్రజలకు ఈ వర్షం కాస్త ఉపశమనాన్ని కలిగించింది.
Comments
Loading comments...

