వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా టోలిచౌకి నుంచి మెహదీపట్నం వెళ్లే రహదారిలో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
రహదారులపై నీరు చేరడంతో జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. ప్రజలు విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, ప్రయాణాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

