వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించడంతో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. జగిత్యాల, సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
బుధ, గురువారాల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు మరింత విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Comments
Loading comments...

